ఆ మెగా హీరోలతో భారీ మల్టీ స్టార్ ప్లాన్ చేస్తున్న అల్లు అరవింద్.. నిజమెంత?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని నిర్మాతగా కొనసాగుతున్న వారిలో అల్లు అరవింద్ ఒకరు.

గీత ఆర్ట్స్ బ్యానర్ ద్వారా ఈయన ఎన్నో అద్భుతమైన బ్లాక్ బస్టర్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి మంచి గుర్తింపు పొందారు.

గీత ఆర్ట్స్ బ్యానర్ నుంచి సినిమా వస్తుంది అంటే ఆ సినిమా మినిమం గ్యారంటీ హిట్ అనే భావన ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది.సినిమాల విషయంలో అల్లు అర్జున్ జడ్జిమెంట్ అలా ఉంటుంది.

ఈ విధంగా గీత ఆర్ట్స్ బ్యానర్ మాత్రమే కాకుండా తెలుగు ఓటీటీ ఆహాను కూడా స్థాపించి ఎంతో విజయవంతంగా ముందుకు తీసుకు వెళుతున్నారు.ఇకపోతేఎన్నో డబ్బింగ్ సినిమాలను కూడా తెలుగులో విడుదల చేస్తూ మంచి గుర్తింపు పొందారు.

తాజాగా అల్లు అరవింద్ సమర్పణలో విడుదలైన కాంతార సినిమా లాభాల బాటలో పయనిస్తుంది.ఇకపోతే తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అల్లు అరవింద్ భారీ మల్టీ స్టార్ సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

Advertisement

సాధారణంగా మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోలు సినిమాలు కనుక విడుదలయితే పెద్ద ఎత్తున రచ్చ ఉంటుంది.అలాంటిది ఇద్దరు మెగా హీరోలు, పాన్ ఇండియా హీరోలు కలిసి భారీ మల్టీ స్టార్ట్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారంటే ఇంకెలా ఉంటుందో ఊహాతీతం.

ఈ క్రమంలోనే అల్లు అరవింద్ మెగా పాన్ ఇండియా హీరోలైన అల్లు అర్జున్ రామ్ చరణ్ లతో కలిసి భారీ మల్టీస్టార ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.అయితే ఇప్పటివరకు కొన్ని కారణాల వల్ల ఈ సినిమా పట్టాలెక్కలేదని,ఈ మల్టీ స్టార్ సినిమా కోసం పది సంవత్సరాల క్రితమే తాను చరణ్ అర్జున్ అనే టైటిల్ రిజిస్టర్ చేసుకున్నానని తెలిపారు.ప్రతి ఏడాది ఈ టైటిల్ రెన్యువల్ చేస్తూ ఉన్నానని ఈయన వెల్లడించారు.

అయితే వీరిద్దరు మల్టీ స్టార్ సినిమా ఎప్పుడు వస్తుంది ఏంటి అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.ఇకపోతే వీరిద్దరూ కలిసి గతంలో ఎవడు అనే సినిమాలో నటించారు.

కానీ అల్లు అర్జున్ అందులో కేవలం ఐదు నిమిషాలు మాత్రమే సందడి చేశారు.నిజంగానే వీరిద్దరి కాంబినేషన్లు సినిమా అంటే అభిమానులకు పండగ అని చెప్పాలి.

చిరంజీవికి నాగబాబు కంటే పవన్ పైనే ప్రేమ ఎక్కువట.. అందుకు కారణాలివే!
Advertisement

తాజా వార్తలు