ఆ స్టార్ హీరో డైలాగ్ విని కంటతడి పెట్టిన సుహాసిని.. అసలేం జరిగిందంటే?

టాలీవుడ్ ప్రముఖ నటీమణులలో ఒకరైన సుహాసినికి ప్రేక్షకులలో ఊహించని స్థాయిలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

రాఖీ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించగా ఈ సినిమాలో సుహాసిని కీలక పాత్రలో నటించి తన నటనతో మెప్పించారు.

ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారనే సంగతి తెలిసిందే.కృష్ణవంశీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

కొత్త హీరోలు, కొత్త తరహా యాక్టర్లను సింక్ లోకి తీసుకొనిరావడానికి రెండు రోజుల సమయం పడుతుందని కృష్ణవంశీ అన్నారు.ఆర్టిస్టులకు తగిన విధంగా డైలాగ్ లు ఉండాలని కృష్ణవంశీ తెలిపారు.

కోర్టు సీన్ లో జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ లు నాట్ ప్రిపేర్డ్ అని ఆయన చెప్పుకొచ్చారు.పరుచూరి గోపాలకృష్ణతో కోర్టు సీన్ కు సంబంధించి ఒక వెర్షన్ రాయించానని కృష్ణవంశీ తెలిపారు.

Advertisement

ఆ తర్వాత ఉత్తేజ్ ఒక వెర్షన్ రాశాడని ఆయన రాసింది నేను పక్కన పెట్టానని కృష్ణవంశీ చెప్పుకొచ్చారు.ఆ తర్వాత నేను ఒక వెర్షన్ రాశానని ఆయన చెప్పుకొచ్చారు.నేను రాసిన దానిలో ఉత్తేజ్ కంటెంట్ ఎక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు.తారక్ కు చదివి వినిపించానని తారక్ చెప్పే సమయంలో కూడా కరెక్షన్స్ చేశామని కృష్ణవంశీ అన్నారు.10 నిమిషాలలో తారక్ ఆ డైలాగ్ ను చెప్పారని తెలిపారు.

జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ చెప్పిన వెంటనే సుహాసిని గారు కంటతడి పెట్టుకున్నారని కృష్ణవంశీ అన్నారు.జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబుకు మెమొరీ బాగుంటుందని కృష్ణవంశీ చెప్పుకొచ్చరు.కృష్ణవంశీ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కృష్ణవంశీ తారక్ కాంబినేషన్ లో మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.కృష్ణవంశీ త్వరలో రంగమార్తాండ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ఖ‌ర్జూరాలు తినే ముందు ఇవి తెలుసుకోపోతే..మీ దంతాల‌కే ముప్పు జాగ్ర‌త్త‌!
Advertisement

తాజా వార్తలు