మరోసారి ఎదురుకాల్పులు…ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతాదళాలు Top Galleries

జమ్మూకాశ్మీర్ లో మరోసారి ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. శుక్రవారం ఉదయం భద్రతా బలగాలకు,ఉగ్రవాదులకు మధ్య ఈ ఎదురుకాల్పులు ఘటన చోటుచేసుకుంది. జమ్మూకాశ్మీర్ లోని పోషియాన్ జిల్లా జైనా పొర ప్రాంతంలోని ద్రగడ్ గ్రామ సమీపంలో ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారం తో భద్రతా బలగాల తో పాటు జమ్మూ కాశ్మీర్ పోలీసులు కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు ముందుగా జవాన్ల పై కాల్పులకు దిగడం తో బలగాలు ఉగ్రవాదుల కాల్పులకు ధీటుగానే ఎదురుకాల్పులు జరపడం తో వారి చర్యలను తిప్పికొట్టారు. ఈ నేపథ్యంలో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

 Cross Fire In Jammu And Two Terrorists Dead-TeluguStop.com

శుక్రవారం వేకువ జామున ఉగ్రవాదులు బలగాల పై కాల్పులకు తెగబడ్డారని, ఈ క్రమంలో బలగాలు ఎదురుకాల్పులు జరపడం తో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అయితే ఇంకా ఆ ప్రాంతంలో భద్రతా సిబ్బంది ఆపరేషన్ కొనసాగుతుంది. మరోపక్క ఈ ఘటన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో మొబైల్,ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేసినట్లుట్ తెలుస్తుంది. పుల్వామా ఉగ్ర దాడి అనంతరం జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో తరచూ ఎదురుకాల్పులు సాగుతూనే ఉన్న సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter