ఏదైనా సినిమాను సగం పూర్తికాగానే థియేటర్ లోకి తీసుకు వస్తే ఎలా ఉంటుంది.? ప్రేక్షకులను పిచోళ్ళని చేయాలనీ ఈ దర్శక నిర్మాతలు బాగా ఫిక్స్ అయినట్టు ఉన్నారు.వీరు చేసింది చుస్తే మీరు కూడా ఇదే మాట అంటారు.రానా దగ్గుపాటి నటించిన 1945 సినిమా విషయంలో ఇప్పుడు ఇదే జరుగుతుంది.జనవరి 7న ఈ సినిమాను విడుదల చేసారు.అయితే ఈ సినిమా చుసిన ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రానా ఈ సినిమాను ఎందుకు పట్టించుకోలేదో ఈ సినిమా విడుదల అయినా తర్వాత అర్ధం అవుతుంది.సంక్రాంతికి పెద్ద సినిమాలు రావడం లేదని తెలిసిన వెంటనే 1945 సినిమా రేస్ లోకి వచ్చి నిన్న రిలీజ్ చేసారు.
నాలుగేళ్ళ క్రితం ఆగిపోయిన ఈ సినిమాను ఇప్పుడు పండగకి రిలీజ్ చేసారు.రానా ఈ సినిమా ను నటించా అనే విషయం కూడా మర్చిపోయి చాలా కాలం అయ్యింది.
ఈ సినిమాకు రానా డబ్బింగ్ కూడా చెప్పలేదు.ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించినప్పటి నుండే ఈ సినిమా కాంట్రవర్సి అయ్యింది.
ఈ సినిమా పోస్టర్ ద్వారా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించిన వెంటనే రానా ట్వీట్ చేసాడు.
ఈ సినిమాతో తనకు ఎలాంటి సంబంధం ల్దాని అసలు ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ లుక్ ఎందుకు విడుదల చేసారో కూడా తెలియదు అని సంచలన ట్వీట్ చేసాడు రానా.
అంతేకాదు ఇది పూర్తికాని సినిమాఅని నిర్మాతపై మండిపడ్డారు రానా.సగం పూర్తి అయినా సినిమాను ఎలా రిలీజ్ చేస్తారు.
అసలు ఇలాంటి సినిమాలను, నిర్మాతలను నమ్మవద్దు అంటూ ట్వీట్ చేసాడు.ఆ తర్వాత నిర్మాత కూడా సినిమా పూర్తి అయ్యిందో లేదో డైరెక్టర్ చూసుకుంటాడులే అంటూ ట్వీట్ చేసాడు.
దానికి రానా కూడా థాంక్స్ అంటూ రిప్లై ఇచ్చాడు.
ఆ తర్వాత డైరెక్టర్ శివ కూడా సినిమా పూర్తి అయ్యిందని ఇప్పటికే సాటిలైట్ బిజినెస్ కూడా జరిగిందని తెలిపాడు.అయితే సినిమా రిలీజ్ అయినా తర్వాత రానా మాటనే నిజం అని తెలిసింది.ఈ సినిమా పూర్తి కాకుండానే రిలీజ్ చేసారు.
ఇది చుసిన ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తునాన్రు.అసలు సినిమాలో ఒక్క బలమైన సన్నివేశం కూడా లేదని ఇలాంటి సినిమా ఎలా తీశారు.
అసలు క్లైమాక్స్ ఏది అంటూ ప్రేక్షకులు ఫైర్ అవుతున్నారు.