పశువుల పేడ కొనుగోలుకు ముందుకు వచ్చిన ప్రభుత్వం!

ఉత్తరప్రదేశ్‌లో పాడి రైతులు తమ పశువుల పెంపకం, ఆదాయం గురించి ఆందోళన చెందుతున్నారు.

రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రైతుల కోసం ఎప్పటికప్పుడు వివిధ పథకాలు తీసుకువస్తోంది.

తాజాగా యోగి ప్రభుత్వం పశువుల పెంపకందారుల కోసం కొత్త పథకాన్ని తీసుకురానుంది.ఈ పథకం కింద పశువుల యజమానుల దగ్గర నుండి ప్రభుత్వం ఆవు పేడను కొనుగోలు చేస్తుంది.

Yogi Government To Buy Cow Buffalo Dung Details, Buffalo Dung, Yogi Government,

యోగి ప్రభుత్వానికి చెందిన పశుసంవర్ధక శాఖ మంత్రి ధరంపాల్ మాట్లాడుతూ ప్రభుత్వం త్వరలో పశువుల యజమానుల నుండి ఆవు పేడ కొనుగోలు చేయబోతున్నదన్నారు.ప్రభుత్వ చేపడుగున్న ఈ పథకంతో రైతుల ఆదాయం పెరగడంతో పాటు పశువుల సమస్యలను కూడా అధిగమించవచ్చన్నారు.

రోడ్లపై తిరిగే జంతువుల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మరో పథకాన్ని తీసుకొచ్చింది.ఈ పథకం కింద అనాథ పశువుల పెంపకానికి ప్రభుత్వం రోజుకు 30 రూపాయలు అంటే నెలకు 900 రూపాయలు, సంవత్సరానికి 10 వేల 800 రూపాయలను వాటి సంరక్షులకు అందజేయనుంది.

Advertisement
వామ్మో, ఇదేం అద్భుతం.. 66 ఏళ్ల వయసులో 10వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ!

తాజా వార్తలు