భువనగిరిలో యోగాదినోత్సవం

యాదాద్రి భువనగిరి జిల్లా: జూన్ 21 యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని రామ్ నగర్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈకార్యక్రమాన్ని ఉద్దేశించి వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తాడెం రాజశేఖర్ మాట్లాడుతూ యోగాసనాల ద్వారా మనిషి ఆరోగ్యాన్ని, అదేవిధంగా మానసిక ఆనందాన్ని పొందుతారని తెలిపారు.

10 సంవత్సరాల నుంచి రాంనగర్ వాకర్స్ అసోసియేషన్ నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని,ఈ సందర్భంగా భువనగిరి పట్టణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ప్రెసిడెంట్ గునుగుంట్ల శ్రీనివాస్,గౌరవ అధ్యక్షుడు చింతకింది కృష్ణమూర్తి,సభ్యులు చామల వెంకటనారాయణ రెడ్డి, మల్లికార్జునచారి,పడాల భాస్కర్,యాదగిరి,ఉపేందర్, శ్రీనివాస్ రెడ్డి,వెంకట్ రెడ్డి, శంకర్ రెడ్డి,రాజు,శ్రీనివాస్, రవీందర్,యాదగిరి,ఇస్తారి నరేష్,సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Blitz Sécurité Des Joueurs Et Jeu Responsable

Latest Yadadri Bhuvanagiri News