వైసీపీకి పొత్తు ఉంటే ప్రజలతోనే.. సీఎం జగన్ కామెంట్స్

వైసీపీకి పొత్తు ఉంటే అది ప్రజలతోనేనని ఏపీ సీఎం జగన్ అన్నారు.పల్నాడు జిల్లాలో పర్యటించిన ఆయన ఫ్యామిలీ డాక్టర్ పథకాన్ని ప్రారంభించారు.

అనంతరం మాట్లాడుతూ తాను పొత్తులపై ఆధారపడనని తెలిపారు.కుయుక్తులు రావన్న సీఎం జగన్ మోసం చేయడం చేతకాదని చెప్పారు.

జిత్తులు, పన్నాగాలు తెలియవని తెలిపారు.ఏం చెప్తానో .అదే చేస్తానని పేర్కొన్నారు.చంద్రబాబు హయాంలో దోచుకో, పంచుకో, తినుకో ఉండేదన్నారు.

చెప్పుకునేందుకు ఒక్క మంచి పని లేకే కుయుక్తులతో రాజకీయాలు చేస్తున్నారని పేర్కొన్నారు.తనకు దేవుడి దయతో పాటు ప్రజల ఆశీస్సులు ఉన్నాయని వెల్లడించారు.

Advertisement
నెలవారీ ప్లాన్‌ ధరలను పెంచేసిన నెట్ ఫ్లిక్స్.. ఎంత పెంచిందంటే..

తాజా వార్తలు