ఈసీని కలిసిన వైసీపీ నేతలు

ఏపీ ఎన్నికల సంఘం అధికారులను వైసీపీ నేతలు కలిశారు.ఈ మేరకు జోగి రమేశ్, మేరుగ నాగార్జున ఈసీకి ఫిర్యాదు చేశారని తెలుస్తోంది.

రాష్ట్రంలో కొందరికి ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉన్నాయని వైసీపీ నేతలు ఈసీకి కంప్లైంట్ చేశారు.ఈ క్రమంలోనే తెలంగాణ, ఏపీ రెండు చోట్ల ఉన్న వారి ఓట్లు తొలగించాలని డిమాండ్ చేశారు.

రెండు రాష్ట్రాల్లోనూ ఓటు వేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారన్న వైసీపీ నాయకులు ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలన్నారు.అంతేకాకుండా తాము ఓట్లు తొలగిస్తున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

నాగార్జునతో ప్రతి ఒక్కరు ప్రేమలో పడతారు.. కుష్బూ సంచలన వ్యాఖ్యలు!
Advertisement

తాజా వార్తలు