ప్రస్తుత ప్రపంచంలో కష్టపడి పనిచేసే వారి కంటే అడ్డదారుల్లో వెళ్లి సులువుగా డబ్బులు సంపాదించే మార్గాలను ఎక్కువగా అవలంబిస్తున్నారు చాలామంది.
ఇకపోతే కొందరు ఆడవాళ్లు మగవారితో సమానంగా మోసాలకు పాల్పడుతూ బోర్లా కొట్టిస్తున్నారు.
అది కూడా కేవలం డబ్బుల కోసం ఎవరిని పడితే వారిని పెళ్లి చేసుకోవడం.అలా వారితో కొన్ని రోజులు సంసారం చేసిన తర్వాత అందిన కాడికి డబ్బు, నగలతో ఉడాయించడం ఈ మధ్యకాలంలో చాలానే చూసాం.
తాజాగా ఇలాంటి సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఓ మహిళ ఏకంగా డబ్బు నగల కోసం 50 మందిని పెళ్లి చేసుకొని మోసం చేసిందని పోలీసులు తెలిపారు.
ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.ఇలా మోసపోయిన 50 మందిలో ముగ్గురు పోలీసులు కూడా ఉండడం.
ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.
తమిళనాడు( Tamil Nadu ) రాష్ట్రంలోని తిరుపూర్ జిల్లా(Tiruppur ) తారాపురానికి చెందిన వ్యక్తి బేకరీ, పశుగ్రాస విక్రయ కంపెనీ నిర్వహిస్తున్నాడు.అతనికి ప్రస్తుతం 35 ఏళ్లు.ఇంకా పెళ్లి జరగపోవడంతో బంధువులు పెళ్లి కోసం అమ్మాయి కోసం వెతుకుతున్న సమయంలో సదరు వ్యక్తికి సంధ్య అనే యువతి ఇంటర్నెట్ సైట్ ద్వారా పరిచయం ఏర్పడింది.
అలా వారిద్దరి మధ్య పరిచయంలో ఆమెకి 30 ఏళ్లు వయసు మాత్రమే ఉందని తెలిపింది.అలా అతడిని బుట్టలో వేసుకునేందుకు కాస్త ప్రేమగా నటించింది.ఇంకేముంది వలలలో వేసుకున్న ఆమె పళని సమీపంలోని ఓ దేవాలయంలో పెళ్లి చేసుకుంది.
వారి పెళ్లికి అబ్బాయి తల్లిదండ్రులు కూడా అంగీకారం తెలిపారు.ఇలా పెళ్లి చేసుకున్న మూడు నెలల వరకు యువకుడితో కలిసి వైవాహిక జీవితాన్ని సవ్యంగానే జరిగాయి.
కాకపోతే., ఆమె చెప్పిన వయసుకు ఆమె శరీరత్వానికి ఎటువంటి పోలిక కుదరకపోవడంతో భర్త కుటుంబానికి అనుమానం వచ్చింది.
ఇందుకు సంబంధించి ఆమె ఆధార్ కార్డును వారు పరిశీలించగా.భర్త స్థానంలో చెన్నై( Chennai ) నగరానికి చెందిన మరో వ్యక్తి పేరు ఉండడంతో ఆశ్చర్యపోయారు.
అంతేకాదు ఆధార్ కార్డులో ఆమె వయసు కూడా భిన్నంగా కనిపించింది.దీంతో అసలు విషయం బయటకు రావడంతో సంధ్య ఆ కుటుంబం పై బెదిరింపులకు దిగింది.
దీంతో అప్రమత్తమైన యువకుడు వెంటనే ఉమెన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చాడు.దీంతో అసలు విషయాన్ని పోలీసులు విచారించగా చెన్నైకి చెందిన వ్యక్తిని 10 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది.
అలా ఆవిడ కొద్దిగా రోజులు పెళ్ళయాక ఉండి నగలు డబ్బుతో అక్కడ నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది.
ఇక సమ్మెకు సంబంధించిన మ్యాట్రిమోనీ లిస్టులో 40 ఏళ్లకు పైబడి ఉన్నప్పుడు ఫాలో అవుతున్నట్లుగా పోలీసులు తెలుసుకున్నారు.దాంతో 40 ఏళ్లు పైబడిన పురుషులను పెళ్ళాడి అందిన కాడికి డబ్బు నగలను కాజేస్తున్నట్లుగా పోలీసులు షాకింగ్ నిజాలను కనుగొన్నారు.ఇందులో ముఖ్యంగా పలువురు బడా వ్యాపారవేత్తలు ఆమెను పెళ్లి చేసుకుని ఆర్థికంగా చాలా పోగొట్టుకున్నారని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy