తెలంగాణ బిడ్డలను చంపిన బలి దేవత ఎవరు?.: కేటీఆర్

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt )పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR )తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ఈ మేరకు ట్విట్టర్ ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ( Telangana )లో వేలాది మంది అమరులు అయ్యారని ఎవరి వలన అని కేటీఆర్ ప్రశ్నించారు.అమరుల స్థూపం నిర్మించాల్సి వచ్చింది ఎవరి వలన అని నిలదీసిన ఆయన ప్రజాస్వామికంగా తమ ఆకాంక్షను వ్యక్తం చేస్తే తెలంగాణను తుంగలో తొక్కింది ఎవరని విమర్శించారు.

అంతేకాకుండా వేలాది తెలంగాణ బిడ్డలను చంపిన బలి దేవత ఎవరో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

హే ప్రభూ.. ఏంటి ఈ విడ్డురం.. బస్సు అనుకుంటే పొరపాటే సుమీ..
Advertisement

తాజా వార్తలు