జమున గారి బయోపిక్ లో హీరోయిన్ ఎవరంటే..?

అప్పట్లో చాలా మంది హీరో లు హీరోయిన్స్ మంచి సినిమాలు చేస్తూ మంచి పేరు సంపాదించుకునే వారు అందులో అలనాటి మేటి హీరోయిన్ అయిన జమున( Jamuna ) గారు ఒకరు ఆమె గత 3 నెలల క్రితం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం నిజంగా భాదని కలిగించే విషయం అనే చెప్పాలి.

ఆమె ఎంత అద్భుతమైన నటి అనేది మనం మాటల్లో చెప్పలేము ఎన్టీఆర్ ( NTR )లాంటి గొప్ప నటుడు జమున గారి యాక్టింగ్ చాలా బాగుంటుంది అని చెప్పారంటే అది మాములు విషయం కాదు.

అప్పటి హీరోయిన్స్ లో సావిత్రి( Savitri ) గారి తర్వాత అంతటి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది కచ్చితంగా జమున అనే చెప్పాలి.

అలాగే ఆవిడ వెండితెర మీద సత్యభామ( Satya Bhama ) గా గుర్తింపు పొందారు.తెలుగు, హిందీతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో కూడా నటించి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న జమున గారు ఎన్నో సినిమాలలో విలక్షణమైన పాత్రలలో నటించి ఆ పాత్రలలో తనను తప్ప మరెవరినీ ఊహించుకోలేనంత అద్భుతంగా నటించి తన నటనతో మెప్పించడం గమనార్హం.పదుల సంఖ్యలో సినిమాలలో సావిత్రికి చెల్లి పాత్రలో జమున నటించి మెప్పించారు.

అలనాటి స్టార్ హీరోలందరికీ జోడీగా జమున నటించడం గమనార్హం.ఎన్టీఆర్, ఏఎన్నార్ జమునకు అవకాశాలు ఇవ్వని సమయంలో కూడా ఆమె 18 సినిమాలలో నటించారంటే ఆమె స్థాయి ఏంటో సులువుగానే అర్థమవుతుంది.

Advertisement

వినాయక చవితి అనే సినిమాలో తొలిసారి సత్యభామ రోల్ లో నటించి జమున గారు మెప్పించడం గమనార్హం.శ్రీ కృష్ణ తులాభారం సినిమాలో కూడా జమున గారు సత్యభామ రోల్ లో కనిపించి ఆకట్టుకున్నారు.జమున గారు నటిగా భారీ స్థాయిలోనే ఆస్తులు కూడబెట్టారు.

జమున గారి ఆస్తుల విలువ 100 కోట్ల రూపాయలకు అటూ ఇటుగా ఉంటుందని తెలుస్తోంది.ఆమెకు జూబ్లీహిల్స్ లో ఖరీదైన భవనం ఉంది.

అలాగే హైదరాబాద్ లోనే కొన్ని ల్యాండ్స్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది.ప్రస్తుతం వీటి విలువ కోట్లలలో ఉంటుందని కూడా తెలుస్తుంది.

అలాగే కొండాపూర్ లో ఒక ఫ్లాట్ తో పాటు ఈమెకు పాత బంగ్లా కూడా ఉంది.ఆమె సినిమాల్లో సంపాదించిన డబ్బు చాలా వరకు సేవ కార్యక్రమాలకి ఇచ్చినట్లు తెలుస్తుంది.జమున చేసిన సేవా కార్యక్రమాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

మహేష్ తో మల్టీస్టారర్ పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు.. మేమిద్దరం క్లాస్ మేట్స్ అంటూ?
మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?

జమున పలు వివాదాల ద్వారా వార్తల్లో నిలిచినా తన తప్పు ఉంటే ఆమె క్షమాపణలు చెప్పేవారు.జమున భర్త పేరు రమణారావు( Ramana Rao ) కాగా ఈ దంపతులకు వంశీ, స్రవంతి( Vamsi, Sravanti ) జన్మించారు.

Advertisement

కొడుకు ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారని సమాచారం అందుతోంది.

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో ఉన్న ఒక ప్రముఖ సంస్థ జమున గారి బయోపిక్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.అందులో భాగంగా జమున గారి పాత్రలో నటించే అద్భుత అవకాశాన్ని టాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ బ్యూటీ కొట్టేసినట్లు తెలుస్తోంది.ఇంతకీ ఆమె ఎవరో కాదు నయనతార( Nayanthara ).ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు సైతం పూర్తి అయినట్లు టాక్‌.సావిత్రి గారి బయోపిక్ వచ్చి మంచి విజయం సాధించడం తో హీరోయిన్స్ అందరూ బయోపిక్ స్టోరీ లు అనగానే తొందరగా సినిమాలు చేస్తున్నారు మహానటి సినిమాలో సావిత్రి పాత్ర పోషించినందుకు గాను కీర్తి సురేష్ కి నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది.

ఇక దాంతో నయనతార ఈ ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నట్టు తెలుస్తోంది.ఇక ఇది ఇలా ఉంటే తొందర్లోనే ఈ సినిమాకి సంభందించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వస్తుందని తెలుస్తుంది.

తాజా వార్తలు