Gudivada Amarnath : రుషికొండలో భవనాలను ప్రారంభించాం..: మంత్రి అమర్నాథ్

విశాఖ( Visakhapatnam )లోని రుషికొండ( Rushikonda )లో భవనాలను ప్రారంభించామని మంత్రి గుడివాడ అమర్నాథ్( Gudivada Amarnath ) అన్నారు.సువిశాలమైన ప్రాంతంలో భవనాలు నిర్మించామన్న ఆయన భవనాలకు అన్ని అనుమతులు తీసుకున్నామని తెలిపారు.

ప్రస్తుతం టూరిజం ప్రాజెక్టు( Tourism project )గా మాత్రమే ఈ భవనాలు పని చేస్తామని చెప్పారు.మరి కొంత నిర్మాణం జరగాల్సి ఉందన్న మంత్రి గుడివాడ ఇప్పటికే ప్రభుత్వ అధికారుల బృందం కొన్ని సలహాలు ఇచ్చారని తెలిపారు.ప్రభుత్వ అధికారుల బృందం సిఫార్సుతో పరిపాలన భవనంగా వినియోగించే అంశం ఆలోచిస్తున్నామని వెల్లడించారు.

ఏఎన్నార్ ఒత్తిడితో మెగాస్టార్ సినిమా వదిలేసిన కోదండరామిరెడ్డి