వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఖరారు..!

వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పేరు ఖరారైంది.

ఈ మేరకు లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా సుధీర్ కుమార్( Marepalli Sudhir Kumar ) పేరును పార్టీ అధినేత కేసీఆర్( KCR ) ప్రకటించారు.

కాగా ప్రస్తుతం సుధీర్ కుమార్ హన్మకొండ జిల్లా( Hanamkonda district ) పరిషత్ ఛైర్మన్ గా ఉన్నారు.

తొలుత వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య( Kadiyam Kavya ) పేరును బీఆర్ఎస్ అధిష్టానం ఖరారు చేసినప్పటికీ ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు.దీంతో ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీని ఎదుర్కొనే విధంగా పట్టున్న నేతలను బరిలో దించాలని భావించిన గులాబీ బాస్ తాజాగా అభ్యర్థిగా సుధీర్ కుమార్ ను ఎంపిక చేశారు.

ఆ విషయంలో ప్రభాస్, నాని గ్రేట్ అంటున్న అభిమానులు.. అసలేమైందంటే?
Advertisement

తాజా వార్తలు