వివేకా హత్య కేసు: దస్తగిరి పిటిషన్ పై సుప్రీం విచారణ

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

కేసులో అఫ్రూవర్ గా మారిన దస్తగిరి న్యాయసహాయం కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

ఈ పిటిషన్ పై ఇవాళ ధర్మాసనం విచారణ జరపనుంది.దస్తగిరి అఫ్రూవర్ గా మారడాన్ని సవాల్ చేస్తూ ఎంవీ కృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై విచారించిన ధర్మాసనం దస్తగిరికి నోటీసులు జారీ చేసింది.ఈ క్రమంలోనే తనకు లాయర్ ను పెట్టుకునే ఆర్థిక స్థోమత లేదని, న్యాయసహాయం కావాలని న్యాయస్థానాన్ని కోరారు.

దీనిపై ఇవాళ విచారణ చేపట్టనుంది.

Advertisement
My Empire : Reseña Y Reputación Del Sitio Para Jugadores E...