ఫలక్ నుమా దాస్ సీక్వెల్ తో టాలీవుడ్ లో అందరికీ దమ్ కి ఇస్తా అంటున్న విశ్వక్ సేన్

ఈ నగరానికి ఏమైంది సినిమాతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న నటుడు విశ్వక్ సేన్.

ఇక ఈ కుర్ర హీరో తాజాగా ఫలక్ నుమాదాస్ సినిమాతో దర్శకుడిగా అలాగే హీరోగా తనదైన ముద్ర వేశాడు.

అయితే ఈ సినిమా మా ప్రేక్షకుల్ని పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయింది.ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా మా ప్రమోషన్ సమయంలో విశ్వక్ సేన్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మీద కాస్త సీరియస్ కావడంతో, వాళ్లందరూ అతనిని సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలెట్టారు.

ఇక ఇక విజయ్ దేవరకొండ ఫాన్స్ కి విశ్వక్ సేన్ కి మధ్య వివాదం మరింత ముదిరి మీడియాలో లో గొడవలు పడేంత వరకు వెళ్ళింది.ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ ని చిత్ర యూనిట్ ఏర్పాటు చేసింది.

ఈ సినిమా సక్సెస్ మీట్ లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ తన సినిమాని కావాలనే కొందరు పనిగట్టుకొని ఫ్లాప్ చేసే ప్రయత్నం చేశారని, కానీ తన సినిమా ప్లాప్ కాలేదని సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని మంచి కలెక్షన్స్ ని రాబడుతుందని విశ్వక్ సేన్ తెలియజేశాడు.ఇక ఇక ఫలక్ నుమా దాస్ కి సీక్వెల్ ని త్వరలో భారీ కాస్ట్ తో తెరకెక్కిస్తానని ఆ సినిమాతో టాలీవుడ్ లో అందరికీ దంకీ ఇస్తానని ఈ సందర్భంగా విశ్వక్ సేన్ చెప్పుకొచ్చాడు.

Advertisement

మరి అతను ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడు అనేది ఇప్పుడు టాలీవుడ్ లో ఆసక్తికరంగా మారింది.

Blitz Sécurité Des Joueurs Et Jeu Responsable
Advertisement