వైరల్ వీడియో: నడిరోడ్డుపై కూర్చి వేసుకొని బైఠాయించిన తాగుబోతు.. చివరకు.?

చాలామంది ప్రజలు మద్యం సేవించక ముందు ఒకలా ఉంటారు.ఒకవేళ మద్యం సేవిస్తే ఆ తర్వాత వారు చేసే పనులు చాలా చిత్ర విచిత్రంగా ఉంటాయి.

ఇలాంటి ఘటన తాజాగా ఓ తాగుబోతు చేశాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.ఈ వైరల్ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.

ఉత్తరప్రదేశ్( Uttar Pradesh ) రాష్ట్రంలోని ప్రతాప్ ఘడ్ లో ఓ వ్యక్తి పూర్తిగా మద్యం సేవించి అనంతరం నడిరోడ్డుపై అర్థనగ్నంగా కూర్చి వేసుకుని బైఠాయించాడు.ఒకవైపు జోరుగా వర్షం కురుస్తున్న సరే మద్యం మత్తలో అతడు ఏం చేస్తున్నాడో కూడా అర్థం కాకుండా రోడ్డుపై కుర్చీలో వాహనాలకు అడ్డంగా కూర్చోగా ఆ సమయంలో చాలామంది అతడికి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పిన కానీ అతడు వినకుండా ఉన్నాడు.జోరుగా వర్షం పడుతున్న సమయంలో కూడా అతడు రోడ్డుపై అడ్డంగా కుర్చీ వేసుకుని కూర్చున్నాడు.

ఈ సమయంలో రోడ్డుపై అనేక వాహనాలు వెళుతూ ఉన్న అతనిని చూసి అతనిని తప్పించి పక్కనుంచి వెళ్ళిపోతున్నాయి.అయితే ఓ లారీ డ్రైవర్ మాత్రం అతడి తీరు నచ్చకపోవడంతో కుర్చీపై కూర్చున్న వ్యక్తిని ఒక్కసారిగా లారీ చివరతో ఢీకొట్టాడు.

Advertisement

అయితే ఈ చర్య కావలనే చేయడంతో అతడికి ఎటువంటి అపాయం కలగకుండా అతడిని గుద్దేశాడు.దీంతో మందు బాబుకు కుర్చీ ముక్కలు ముక్కలుగా అవ్వగా.అతడు కొద్ది దూరంలో ఎగిరిపడ్డాడు.

అయితే అతనికి ఎలాంటి గాయాలు కాకపోవడం సంతోషకరమైన విషయం.ఇక ఆ మందుబాబును అజయ్( Ajay ) గా గుర్తించారు అక్కడి స్థానికులు.

విషయం తెలుసుకున్న పోలీసులు మందుబాబును అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు.అయితే అక్కడి చేరుకున్న కుటుంబ సభ్యులు, అతడు మానసిక విగ్రహాన్ని తెలియజేయడంతో అతనిని తిరిగి మరి కుటుంబ సభ్యులకు అప్పగించేశారు.

ప్రస్తుతం ఈ ఘటనను అక్కడి ప్రజలు రికార్డు చేయగా ప్రస్తుతం ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది.

ఇది చూసాక కూడా మ్యాంగో జ్యూస్ తాగితే ఇక అంతే.. వీడియో వైరల్..
Advertisement

తాజా వార్తలు