వీడియో: ముంబై ఎయిర్‌పోర్ట్‌లో దోశ బంగారం కంటే ఖరీదేనట..!

విమానాశ్రయాలలో ఫుడ్ ఐటమ్స్ రేట్లు దారుణంగా ఉంటాయి.బయట ఫుడ్ రేట్లతో పోలిస్తే పది రెట్లు అధికంగా ఎక్కడ ఉంటాయి.

మరీ అంత ధర పెట్టడానికి కారణం ఏంటో తెలియదు కానీ ఈ ధరలకు చాలామంది అలవాటు పడ్డారు.అయితే ఇప్పుడు ముంబై ఎయిర్‌పోర్ట్‌లోని ( Mumbai Airport )ఓ రెస్టారెంట్‌ టిఫిన్ ల కోసం భారీగా డబ్బులు వసూలు చేస్తూ నెటిజన్ల ఆగ్రహానికి గురవుతోంది.

ఇటీవల ఒక కస్టమర్ మసాలా దోశ( Masala dosha ) ధరను ఇంటర్నెట్‌ వేదికగా వెల్లడించాడు.చెఫ్ డాన్ ఇండియా అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ పేరు చేసిన వీడియో ఈ మసాలా దోశ రేటుకు సంబంధించిన మెనూ కార్డును చూపించింది.

అలాగే దోశ ప్రిపేర్ చేయడాన్ని కూడా ప్రదర్శించింది.అదొక డిజిటల్ మెనూ కార్డ్, వీడియో క్లిప్‌లో, మజ్జిగతో పాటు మాములు మసాలా దోశ ప్లేట్ ధర రూ.600గా పేర్కొనడం మనం చూడవచ్చు.రెస్టారెంట్ కస్టమర్లు లస్సీ లేదా ఫిల్టర్ కాఫీని డ్రింక్‌గా సెలెక్ట్ చేసుకోవడానికి కూడా సదుపాయం కల్పించింది.అయితే ఈ ఎక్స్‌ట్రా డ్రింక్ కోసం అదనంగా రూ.20 చెల్లించాల్సి ఉంటుంది.

Advertisement

దోశ మాత్రమే కాకుండా, రెస్టారెంట్‌ ఇడ్లీ, ఉత్తపం వంటి అనేక మామూలు టిఫిన్లను కూడా ఇది భారీ ధరలకు విక్రయిస్తోంది.ఒక బెన్నె ఖాలీ దోశకు( Benne Khali Dosha ) రూ.640, ఆవిరితో చేసిన ఇడ్లీ ప్లేట్‌కి రూ.530, మసాలా ఉత్తపానికి రూ.620కి ధరలను ఈ రెస్టారెంట్ వసూలు చేస్తోంది."ముంబై ఎయిర్‌పోర్ట్‌లో దోశ కంటే బంగారం చౌక.రూ.600 మాత్రమే" ఈ వైరల్ వీడియోకు ఒక క్యాప్షన్ జోడించారు.

ఈ పోస్ట్ ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ అయ్యాక ఇన్‌స్టాగ్రామ్‌లో కోటి దాకా వ్యూస్‌తో దూసుకుపోయింది.ఇంత ధరలు పెట్టి అసలు ఎవరు కొనుగోలు చేస్తారు అని నెటిజన్లు తమ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.మరికొందరు ఈ రేట్ల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు