ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఇద్దరు విద్యార్థినిలు అదృశ్యం

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఇద్దరు విద్యార్థినిలు అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది.

సత్తుపల్లి గిరిజన వసతి గృహంలోని విద్యార్థినిలు నిన్న మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది.

సదరు విద్యార్థినిలు రాజేశ్వరి, శైలజలుగా గుర్తించిన హాస్టల్ వార్డెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.విద్యార్థులు కనిపించడం లేదన్న సమాచారం అందుకున్న తల్లిదండ్రులు సత్తుపల్లి గిరిజన వసతి గృహం దగ్గర ఆందోళనకు దిగారు.

దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థినిల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.

మనుషులను అంచనా వేయడంలోనూ వేణుస్వామి తోపు.. బిగ్‌బాస్ నెక్స్ట్ సీజన్ గెలిచేస్తారా..? 
Advertisement

తాజా వార్తలు