టీవీ 5 మూర్తి ఈసారి కౌశల్‌ ను కడిగేసి, ఆరేశాడు

ఈమద్య కాలంలో న్యూస్‌ రీడర్‌ మూర్తి బాగా ఫేమస్‌ అవుతున్నాడు.శ్రీరెడ్డి ఇష్యూ సమయంలోనే ఈయన పేరు బయట అందరికి తెల్సిందే.

ఆ తర్వాత పవన్‌ కళ్యాణ్‌ కాపుల మీటింగ్‌ అంటూ సంచలన కథనాన్ని ప్రసారం చేయడంతో ఈయన గురించి మరింత పబ్లిసిటీ జరిగింది.ఆ సమయంలోనే ఆయన్ను మహాటీవీ వారు తొలగించడం జరిగింది.

దాంతో సొంతంగానే యూట్యూబ్‌ ఛానెల్స్‌ లో కనిపిస్తూ వచ్చిన మూర్తికి టీవీ 5 లో జాబ్‌ వచ్చింది.ఈయన ఈమద్య వరుసగా నాయకులు, సెలబ్రెటీలు అందరిని కూడా కడిగేస్తున్నాడు.

తాజాగా కౌశల్‌ ను కూడా పూర్తిగా కడిగి పారేశాడు.

Advertisement

టీవీ5 లో మూర్తి ఇంటర్వ్యూలో కౌశల్‌ పాల్గొన్నాడు.ఆ సందర్బంగా కౌశల్‌ తనకు వచ్చినట్లుగా ప్రకటించిన డాక్టరేటు, పీఎంఓ నుండి కాల్‌, గిన్నీస్‌ బుక్‌ ఇలా అన్ని కూడా ఫేక్‌ అని నిరూపించాడు.చాలా కాలంగా కౌశల్‌ సోషల్‌ మీడియాలో ప్రకటించిన ఆ విషయాలు నిజమేనా, నిజంగానే కౌశల్‌కు గౌరవ డాక్టరేట్‌ వచ్చిందా, నిజంగా కౌశల్‌కు పీఎంఓ నుండి కాల్‌ వచ్చిందా అంటూ అంతా అనుకున్నారు.

కాని తాజాగా మూర్తి అవన్ని కూడా ఫేక్‌ అని తేల్చి చెప్పడంతో కౌశల్‌ కూడా ఒప్పుకున్నాడు.

అయితే తనకు డాక్టరేట్‌ ఇస్తామని కొందరు రావడం నిజమే అని, వారు ఫేక్‌ అని ఆ తర్వాత తెలుసుకున్నాను అన్నాడు.ఇక పీఎంఓ నుండి కాల్‌ అన్నది కూడా నిజం కాదని, ఎవరో ఆకతాయి చేసిన పని అంటూ కౌశల్‌ పేర్కొన్నాడు.ఇక గిన్నీస్‌ బుక్‌ రికార్డు విషయమై క్లారిటీ లేదని, వారి నుండి ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదని పేర్కొన్నాడు.

ఇక తనకు వచ్చిన ప్రైజ్‌ మనీని క్యాన్సర్‌ రోగ్గులకు కౌశల్‌ ప్రకటించాడు.అయితే అది కూడా అబద్దం అని మూర్తి రాబట్టాడు.అసలు ఇప్పటి వరకు ప్రైజ్‌ మనీ కౌశల్‌ చేతికి రాలేదట.

ప్రైజ్‌ మనీ చేతికి వచ్చిన తర్వాత క్యాన్సర్‌ రోగుల కోసం ఇస్తానని కౌశల్‌ చెప్పుకొచ్చాడు.అయితే పైవన్నీ కూడా కౌశల్‌ కావాలని తనకు తాను చెప్పుకున్నవి కాదట.

Advertisement

కొందరు ఆయన్ను మోసం చేశారని వెళ్లడయ్యింది.