ఐనవోలు ఆలయ కమిటీ నియామకం చెల్లదన్న టీఎస్ హైకోర్టు..!

ఐనవోలు ఆలయ కమిటీ నియామకం చెల్లదని తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

జైపాల్ యాదవ్ ఛైర్మన్ గా 15 మందితో కమిటీ ఏర్పాటైన సంగతి తెలిసిందే.

జైపాల్ యాదవ్ కుటుంబం ఆలయ ఆదాయంలో హక్కు దారుడిగా ఉన్నారంటూ శ్రీనివాస్ కోర్టును ఆశ్రయించారు.ఈ నేపథ్యంలో పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం ఛైర్మన్ తో పాటు కమిటీ నియామకం నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

కాగా రేపటి నుంచి ఐనవోలు మల్లికార్జున స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

Validation Check 2026
Advertisement