కేటీఆర్ సూచన : సుహాసినికి మంత్రి పదవి !

కూకట్ పల్లి టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసినికి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు అని చంద్రబాబు ను కేటీఆర్ ప్రశ్నించారు.

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు నందమూరి కుటుంబం పై ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నాడని.

నిజంగా అంత ప్రేమే ఉంటే నందమూరి సుహాసినికి కూకట్ పల్లిలో అభ్యర్థిగా నిలబెట్టకుండా.ఏపీలో ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో స్థానం ఎందుకు కల్పించలేదని కేటీఆర్ ప్రశ్నించారు.

అంతే కాదు చంద్ర బాబు కి నిజముగా.దమ్మంటే తన కొడుకు లోకేష్‌కు కూకట్ పల్లి అభ్యర్థిగా బరిలోకి దించితే బాగుండేది అన్నారు.కానీ బాబు మాత్రం తన కొడుక్కి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోయినా .మంత్రిని చేసుకుని .నందమూరి సుహాసిని ని మాత్రం ఎన్నికల బరిలోకి దింపి బలిపశువును చేస్తున్నాడని విమర్శించారు.ఈ రోజు కూకట్ పల్లి నియోజకవర్గంలో కేటీఆర్ నిర్వహించిన రోడ్ షో లో ఈ వ్యాఖ్యలు చేశారు.

Advertisement