అమెరికాలో భారత సంతతి బాలుడు దుర్మరణం...!

అమెరికాలో మరో ఘోరం జరిగిపోయింది.భారత సంతతికి చెందిన ఓ బాలుడు ప్రమాదవశాత్తు రైలు ప్రమాదంతో మృతి చెందాడు.

ఈ సంఘటన ఆ కుటుంభాన్ని తీవ్రంగా కలిచి వేసింది.సరిగ్గా గంట ముందే తన కొడుకుని స్కూల్ వద్ద దించి వచ్చామని ఇలా ఎందుకు జరిగిందో అంటూ గుండెలు అవిసేలా వారు చేస్తున్న రోదన అందరిని కలిచి వేసింది.

వివరాలలోకి వెళ్తే.

  కేరళాకి చెందిన ఓ జంట అమెరికాలో చాలా కాలం క్రింత స్థిరపడ్డారు.ఆ ఇద్దరు దంపతులు ఉద్యోగాలు చేస్తున్నారు.వారికి జాన్ సాబు అనే 15 ఏళ్ళ కొడుకు ఉన్నాడు.

Advertisement

ఎప్పటిలాగనే రోజు అతడిని స్థానికంగా ఉన్న Hewlett High School(Hewlett,NY) లో ఉదయం దించి వారు తమ ఉద్యోగ నిమిత్తం వెళ్ళిపోయారు.ఆ తరువాత జాన్ సాబు తన పుస్తకం మర్చిపోవడంతో తల్లి తండ్రులకి చెప్పకుండానే ఇంటికి వెళ్ళాడు.

  తన వద్ద ఉన్న మరొక కీతో ఇంటి తలుపు తెరిచి పుస్తకాన్ని తీసుకుని స్కూల్ కి వెళ్తున్నాడు.మార్గ మధ్యంలో రైలు ట్రాక్ నుంచీ దాటుతున్న సమయంలో అకస్మాత్తుగా వచ్చిన రైలు అతడిని డీ కొట్టింది.దాంతో సాహు అక్కడికక్కడే మృతి చెందాడు.

ఈ విషయం తెలుసుకున్న తల్లి తండ్రులు కొడుకు మృతదేహం వద్ద విలపించడం చూసిన ప్రతీ ఒక్కరికి కళ్ళు చెమర్చాయి.తమకి ఫోన్ లో చెప్పినా వెంటనే వచ్చి పుస్తకం ఇచ్చి వెళ్ళేవాళ్ళం అంటూ వారు వాపోతున్నారు.

Bet365 бонусная программа: разбор механик, ограничений и реальной ценности
Advertisement