కిడ్నీలు పరిశుభ్రం అవ్వాలంటే.. ఈ పానీయాలను ప్రతిరోజు తీసుకుంటే మంచిది..

మానవ శరీరంలో కిడ్నీలు చాలా ముఖ్యమైన అవయవాలు.ఇవి రక్తాన్ని శుభ్రపరచడానికి శరీరం నుంచి విష పదార్థాలను బయటకు పంపడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

కానీ చాలా సార్లు కొన్ని టాక్సిన్స్ కిడ్నీలను దెబ్బతీస్తాయి.వీటి ద్వారా ఒక్కోసారి కిడ్నీలు ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంటుంది.

కానీ రోజు ఒక డ్రింక్ తాగడం వల్ల కిడ్నీలను క్లీన్ చేసుకోవచ్చు.వాటిని దెబ్బతీయకుండా కాపాడుకోవచ్చు.

కిడ్నీ క్లెన్సింగ్ డ్రింక్స్‌ గురించి ఈ రోజు తెలుసుకుందాం.మూత్రపిండము ప్రధాన విధి శరీరంలోని మురికిని, ద్రవాలను మూత్రం ద్వారా బయటకి పంపించడం.

Advertisement

ఇది కాకుండా మూత్రపిండాలు శరీరంలోని ఉప్పు, పొటాషియం, యసిడ్ పరిమాణాన్ని నియంత్రిస్తాయి.అంతేకాకుండా శరీరంలోని ఇతర భాగాలు పనిచేయడానికి అవసరమైన హార్మోన్లు మూత్రపిండాల నుంచి విడుదలవుతాయి.

హార్వర్డ్ నివేదిక ప్రకారం రోజూ రెండు గ్లాసుల నిమ్మరసం తాగడం వల్ల యూరినరీ సిట్రేట్ పెరుగుతుంది.

దీని వల్ల కిడ్నీ నుంచి టాక్సిన్స్ తొలగిపోతాయని ఈ అధ్యాయనం లో తెలిసింది.అదే సమయంలో రోజు రెండు నుంచి రెండు పాయింట్ ఐదు లీటర్ల ముత్ర విసర్జన చేసే వ్యక్తులకు మూత్రపిండాల్లో రాళ్లు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.కిడ్నీ హెల్త్ డ్రింక్ ఉదయం మధ్యాహ్నం త్రాగవచ్చు.

నిమ్మరసం, పుదీనా ఆకులు, కాస్త చక్కెరను ఒక గ్లాసు నీటిలో వేసి బాగా కలిపి త్రాగాలి.

Garam masala : భారతీయులు ఉపయోగించే గరం మసాలాతో.. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా..!

ప్రతి రోజు ఇలా తాగితే మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి.ఒక గ్లాసులో నిమ్మరసం జీలకర్ర, ధాన్యాల పొడి, సోడా వేసి బాగా కలిపి త్రాగడం వల్ల కిడ్నీల ఆరోగ్యం బాగుంటుంది.ఒక గ్లాసులో కొబ్బరినీళ్లు పోసుకొని ఇందులో నిమ్మరసం కలుపుకుని త్రాగడం వల్ల కూడా కిడ్నీలు పరిశుభ్రమవుతాయి.

Advertisement

తాజా వార్తలు