పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదు.. మంత్రి ఉత్తమ్

పార్లమెంట్ ఎన్నికల తరువాత తెలంగాణలో బీఆర్ఎస్( BRS ) ఉండదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ( Minister Uttam Kumar Reddy )అన్నారు.

పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు వచ్చే స్థానాలు సున్నా అని పేర్కొన్నారు.

దేశంలో ఏ పార్టీ కూడా ఇంత త్వరగా కుప్పకూలిపోలేదని చెప్పారు.భయం, ఫ్రస్టేషన్ తో కేసీఆర్ మాట్లాడుతున్నారని విమర్శించారు.

కేసీఆర్ కుటుంబ సభ్యులు తప్ప బీఆర్ఎస్ లో ఎవరూ మిగలరని తెలిపారు.అదేవిధంగా పవర్ విషయంలో బీఆర్ఎస్ చెప్పేది అవాస్తవమని పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఎక్కడా ఒక్క నిమిషం కూడా కరెంట్ కట్ లేదని వెల్లడించారు.

Advertisement
Rose Flowers Stomach Fat : గులాబీ పూలతో ఇలా చేస్తే బాన పొట్ట ఫ్లాట్ గా మారడం ఖాయం!