పొత్తులపై వస్తున్న వార్తలు అవాస్తవం..: తరుణ్ చుగ్

తెలంగాణలో బీజేపీ పొత్తులపై వస్తున్న వార్తలను బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్ ఖండించారు.

టీడీపీతో పొత్తు ఉండదన్న ఆయన వైఎస్ఆర్టీపీకి అండగా నిలబడాలని తాను అన్నట్లు వస్తున్నవార్తలు అవాస్తవం అని చెప్పారు.

రాష్ట్రంలో బీఆర్ఎస్ ను ఓడించే సత్తా బీజేపీకి ఉందని తెలిపారు.మరికొన్ని నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో టీడీపీ పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన విషయం తెలిసిందే.

అదేవిధంగగా టీడీపీతో తాము పొత్తు పెట్టుకోబోమని ఇప్పటికే బీజేపీ రాష్ట్ర నేతలు తేల్చి చెప్పారు.ఈ సమయంలోనే టీడీపీతో పొత్తు అంశంపై బీజేపీ సమాలోచనలు చేస్తుందనే వార్తలు చక్కర్లు కొట్టాయి.

ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.ఈ క్రమంలోనే బీజేపీకి ఎటువంటి పొత్తులు పెట్టుకోనే యోచన లేదని తరుణ్ చుగ్ స్పష్టం చేశారు.

Advertisement
ఎమ్మెల్సీ ఎన్నికలు : రెండు పార్టీల్లోనూ గెలుపు ధీమా 

తాజా వార్తలు