నిజామాబాద్ స్కానింగ్ సెంటర్ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్..!

నిజామాబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన అయ్యప్ప స్కానింగ్ సెంటర్ (Ayyappa Scanning Center)వ్యవహారంపై ప్రభుత్వం తీవ్రంగా మండిపడింది.

స్కానింగ్ కు వచ్చిన మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో కేసు విచారణకు నలుగురు సభ్యులతో కూడిన కమిటీని రాష్ట్ర సర్కార్ ఏర్పాటు చేసింది.

ఈ కమిటీలో నలుగురు సీనియర్ మహిళా వైద్యులు ఉన్నారని తెలుస్తోంది.కాగా వారం రోజుల్లో ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక అందించనున్నారు.

ఈ నివేదిక ఆధారంగా స్కానింగ్ సెంటర్(Scanning Centro) పై సర్కార్ చర్యలు తీసుకోనుంది.

ఈ స్టార్స్ అంత ఇంజనీర్స్ అని మీకు తెలుసా..?
Advertisement