హైదరాబాద్ గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్ లోని గన్ పార్క్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.అమరవీరుల స్థూపం వద్దకు వెళ్తుండగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.

రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో అనుమతి లేదంటూ రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.ఈ క్రమంలో రేవంత్ రెడ్డికి, పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది.

దీంతో గన్ పార్క్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.కాగా రెండు రోజుల క్రితం మద్యం, డబ్బు లేకుండా ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమా అంటూ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ కు ఛాలెంజ్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్దకు వచ్చారు.రేవంత్ రెడ్డి ఛాలెంజ్ నేపథ్యంలో అమరవీరుల స్థూపం వద్ద భారీగా మోహరించారు.

Advertisement
మరో అరుదైన గౌరవాన్ని అందుకున్న రామ్ చరణ్.. క్లీంకార పుట్టాక అంతా శుభమే!

తాజా వార్తలు