తెలంగాణ సీఎం అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు..!

తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన మరికాసేపటిలో కలెక్టర్ల సదస్సు జరగబోతోంది.నూతన సచివాలయంలో ఈ సదస్సును నిర్వహించనున్నారు.

ఈ సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో పాటు పోలీస్ కమిషనర్లు పాల్గొననున్నారు.కాగా తెలంగాణ దశాబ్ది వేడుకలపై ప్రధానంగా ఈ సదస్సులో చర్చించనున్నారని తెలుస్తోంది.

అయితే ఇప్పటికే సంబురాలను దాదాపు 21 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.అదేవిధంగా రాష్ట్రంలో హరితహారం, పోడు పట్టాల పంపిణీతో పాటు ఇళ్ల పట్టాల పంపిణీపై కేసీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.

వాడిన కాఫీ పొడిని మ‌ళ్లీ ఇలా కూడా వాడొచ్చు.. తెలుసా?
Advertisement