కేంద్ర హోంశాఖ సహాయమంత్రిని కలిసిన టీడీపీ ఎంపీలు

ఢిల్లీలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రిని ఏపీ టీడీపీ ఎంపీలు కలిశారు.

కేంద్రమంత్రి నిత్యానంద రాయ్ తో ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు.

అనంతరం ఏపీలో జరుగుతున్న అక్రమ అరెస్టుల అంశంపై ఫిర్యాదు చేశారు.తమ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, అరెస్ట్ లు చేస్తున్నారని టీడీపీ ఎంపీలు ఫిర్యాదులో పేర్కొన్నారు.

కేంద్రం స్పందించి తమకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా ఎంపీలు కోరారు.

Betfair Review And Player Reputation (UK) : An Analytical Guide
Advertisement