Tamil Directors : ఆడియన్స్ ను పిచ్చోళ్లను చేస్తున్న తమిళ డైరెక్టర్లు.. సినిమా ఫ్లాపైతే భలే కవర్ చేస్తున్నారుగా!

కాగా తమిళ ఇండస్ట్రీకి చెందిన కొందరు దర్శకులు ఇటీవల కాలంలో క్రేజీ ప్రాజెక్ట్స్ తో ఆడియన్స్ ముందుకు వచ్చి ఆ సినిమాల రిజల్ట్స్ అటు ఇటు అవ్వగానే వెంటనేఒక చిన్న స్టేట్‌మెంట్ ఇచ్చి వారి తప్పుని భలే కవర్ చేసుకుంటూ వస్తున్నారు.

అటువంటి వారిలో లోకేష్ కనగరాజ్, పి వాసు, ఐశ్వర్య ,రజినీకాంత్( Lokesh Kanagaraj, P Vasu, Aishwarya, Rajinikanth ) లు కూడా ఉన్నారు.

కాగా తమిళ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దళపతి విజయ్ తో తెరకెక్కించిన మోస్ట్ హైపెడ్ మూవీ లియో( Leo ).లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వచ్చిన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ తో అదిరిపోయే కలెక్షన్స్ ని రాబట్టినప్పటికీ, ఆడియన్స్ అంచనాలను అందుకోవడంలో మాత్రం విఫలమైంది.ముఖ్యం సినిమాలోని సెకండ్ హాఫ్ ఆడియన్స్ కి బోర్ కొట్టించింది.

ఇక ఈ విషయానే లోకేష్ ని ప్రశ్నించగా, ఆయన బదులిస్తూ.

సెకండ్ హాఫ్ లో చూపించిన ఫ్లాష్ బ్యాక్ ఫేక్ అయ్యి ఉండవచ్చు అంటూ కవర్ చేస్తూ మాట్లాడారు.అలాగే ఇక రజినీకాంత్ బ్లాక్ బస్టర్ సినిమా చంద్రముఖి కి సీక్వెల్ గా దర్శకుడు పి వాసు.రాఘవ లారెన్స్ తో ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చిన సినిమా చంద్రముఖి 2( Chandramukhi 2 ).గత ఏడాది రిలీజైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ గా నిలిచింది.ఇక ఈ మూవీ రిజల్ట్ పై వాసు మాట్లాడుతూ.

Advertisement

సినిమాకి సంబంధించిన 480 షాట్స్ పోయాయి అంటూ ఏదో చెప్పి కవర్ చేసుకున్నారు.

తాజాగా రజినీకాంత్ కూతురు ఐశ్వర్య తెరకెక్కించిన లాల్ సలామ్( Lal Salaam ) కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.ఇక ఈ రిజల్ట్ గురించి ఐశ్వర్య మాట్లాడుతూ.సినిమాలోని ముఖ్యమైన ఫుటేజ్‌ అయినా క్రికెట్ మ్యాచ్ సీన్స్ పోయాయని, దాదాపు 21 రోజుల షూటింగ్ చేసిన ఆ ఫుటేజ్‌ అంతా పోయింది అంటూ చెప్పుకొస్తూ తమ తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసింది.

ఇలా సినిమా రిజల్ట్ లో తమ తప్పేమి లేదని చెప్పుకోవడానికి.వీళ్లు చెబుతున్న రీజన్స్ ఆడియన్స్ ని ఫూల్స్ చేసేలా కనిపిస్తున్నాయి.

ఈ హోమ్ మేడ్ టోనర్ ను వాడితే మొటిమలు దరిదాపుల్లోకి కూడా రావు!
Advertisement

తాజా వార్తలు