ఖమ్మం జిల్లాలో హై టెన్షన్..

తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ పిలుపు నేపథ్యంలో ఇవాళ విద్యాసంస్థల బంద్ కొనసాగిన విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాలోని పలు పాఠశాలల్లో బంద్ కొనసాగింది.

అయితే ఈ క్రమంలోనే ఐడీపీఎస్( ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ) ప్రాంగణంలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.స్కూల్ ను బంద్ చేసినప్పటికీ అక్కడకు చేరుకున్న కొన్ని విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.

అనంతరం దాడికి పాల్పడటంతో స్కూల్ బస్సుల అద్దాలు ధ్వంసం అయ్యాయి.తరువాత స్కూల్ ఎదుట బైఠాయించిన విద్యార్థి సంఘ నాయకులు నిరసనకు దిగారు.

God Of Coins Player Safety And Responsible Gambling (UK)
Advertisement