బాలయ్య పంతం వీడితే బెటర్.. నందమూరి ఫ్యాన్స్ విడిపోయే పరిస్థితి వద్దంటూ?

నందమూరి బాలకృష్ణకు( Nandamuri Balakrishna ) ఈ మధ్య కాలంలో లక్ కూడా కలిసొస్తుందనే సంగతి తెలిసిందే.

బాలయ్య గత సినిమాలైన అఖండ, వీరసింహారెడ్డి సంచలన విజయాలను సొంతం చేసుకోగా గత కొన్నేళ్లుగా హ్యాట్రిక్ సాధించని బాలయ్య అనిల్ డైరెక్షన్ లో ( Anil Ravipudi ) తెరకెక్కుతున్న సినిమాతో హ్యాట్రిక్ ను సొంతం చేసుకుంటారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఓటీటీ షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తూ బాలయ్య ఆ షోలతో కూడా ఆకట్టుకుంటున్నారు.ఎమ్మెల్యేగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న బాలయ్య ఆ కార్యక్రమాలతో ప్రజలకు మరింత దగ్గరవుతున్నాయి.

తారకరత్న మరణించిన సమయంలో అలేఖ్యారెడ్డి కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా బాలయ్య వ్యవహరించిన తీరుకు ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.అయితే ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ విషయంలో బాలయ్య కఠినంగా వ్యవహరిస్తున్నారని, పంతానికి పోతున్నారని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

నందమూరి ఫ్యాన్స్( Nandamuri Fans ) రెండుగా విడిపోయి గొడవ పడే పరిస్థితి, కొట్టుకునే పరిస్థితి వద్దని కొంతమంది అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.బాలయ్య పంతం వీడితే మాత్రమే ఈ పరిస్థితి మారే అవకాశాలు అయితే ఉంటాయి.నందమూరి అభిమానులు కలిసికట్టుగా ఉంటే మాత్రమే సినిమాలు మంచి ఫలితాలను సొంతం చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

ఎన్టీఅర్, కళ్యాణ్ రామ్ లకు( NTR Kalyan Ram ) ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా బాలయ్యతో ఉండే గ్యాప్ వల్ల కెరీర్ పై కొంతమేర ప్రభావం పడే అవకాశం ఉంది.ఏ కుటుంబంలో అయినా చిన్నచిన్న సమస్యలు కామన్ అని ఆ సమస్యలను పరిష్కరించుకుని సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.బాలయ్య అనిల్ కాంబో మూవీ టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ తో ఉన్న గ్లింప్స్ జూన్ నెల 10వ తేదీన విడుదల కానుందని సమాచారం.

సినిమా రిలీజ్ కు తక్కువ సమయం ఉండటంతో బాలయ్య అనిల్ కాంబో సినిమా ప్రచారానికి సంబంధించి వేగం పెరిగింది.

Advertisement

తాజా వార్తలు