ఒడిస్సా షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఎస్ఎస్ఎంబి 29.... స్పీడ్ మీద ఉన్న జక్కన్న!

దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి(Rajamouli) ప్రస్తుతం మహేష్ బాబు(Mahesh Babu)తో సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

ప్రస్తుతం ఈ సినిమా ఎస్ఎస్ఎంబి (SSMB29) అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

ఇక ఈ సినిమా చిత్రీకరణ శర వేగంగా జరుగుతోందని తెలుస్తోంది.ఇప్పటికే హైదరాబాద్లో అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా వేసిన ఒక సెట్లో ఫస్ట్ షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకున్నారు.

అయితే ఇక్కడ ఈ షెడ్యూల్ పూర్తి కావడంతో చిత్ర బృందం ఒరిస్సా వెళ్లారు.ఇలా ఒరిస్సాలో రెండో షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకున్నారని తెలుస్తోంది.

గత 15 రోజులుగా ఈ సినిమా చిత్రీకరణ ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో నడుస్తోంది.సిమిలిగుడకు సమీపంలోని మాలి, పుట్‌సీల్, బాల్డ (Mali, Putsiel, Balda)తదితర ప్రాంతాల్లో నటీనటులతో ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు.

Advertisement

ఇక మంగళవారం సాయంత్రం ఇక్కడ ఈ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి అయినట్టు తెలుస్తుంది.ఈ క్రమంలోనే అక్కడ వీరిని చూడడం కోసం అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడంతో చిత్ర బృందం వీరితో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు అందుకు సంబంధించిన ఫోటోలు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ షెడ్యూల్ షూటింగ్లో భాగంగా మహేష్ బాబుతో పాటు పృధ్విరాజ్ సుకుమారన్, నటి ప్రియాంక చోప్రా(Priyanka Chopra) కూడా పాల్గొన్నారని తెలుస్తుంది.ఇక ఈ సినిమా తదుపరి షెడ్యూల్ తిరిగి హైదరాబాదులోనే షూటింగ్ జరుపుకోబోతుందని తెలుస్తుంది.ఇలా రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో మొదటిసారి రాబోతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి.

అంతేకాకుండా ఈ సినిమాని రాజమౌళి శరవేగంగా షూటింగ్ పనులను జరుపుతున్నారని తెలుస్తోంది.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్.నారాయణ నిర్మిస్తున్నారు.

ఈ సినిమాతోనైనా భావన కెరీర్ గాడిలో పడుతుందా.?
Advertisement

తాజా వార్తలు