కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన శ్రీముఖి... వైరల్ అవుతున్న గృహప్రవేశ ఫోటోలు!

తెలుగు బుల్లితెరపై యాంకర్లుగా కొనసాగుతున్న వారిలో యాంకర్ శ్రీముఖి ఒకరు.బుల్లితెర రాములమ్మగా ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలతో ఈమె ఎంతో బిజీగా గడుపుతున్నారు.

కేవలం ఒక్క ఛానల్ లో మాత్రమే కాకుండా బుల్లితెరపై ప్రసారమయ్యే ప్రతి ఒక్క ఛానల్ లోనూ ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తూ ఎంతో బిజీ బిజీగా కడుపుతున్న శ్రీముఖి ఒక్కోషోకి భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.ఇలా వరుస కార్యక్రమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి ఈమె భారీగానే ఆస్తులు కూడా కూడ పెడుతున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఈ మధ్యకాలంలో బుల్లితెర నటీనటులు యాంకర్లు పెద్ద ఎత్తున కొత్త ఇంటిని కొనుగోలు చేసి గృహప్రవేశం చేస్తున్నారు.ఈ క్రమంలోనే శ్రీముఖి సైతం కొత్త ఇంట్లోకి అడుగు పెట్టినట్టు తెలుస్తుంది.

ఈ క్రమంలోనే తన నూతన గృహప్రవేశానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.అయితే బంధుమిత్రులు ఎవరూ లేకుండా చాలా సింపుల్ గా శ్రీముఖి ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే పాలు పొంగించి గృహప్రవేశం చేసినట్టు తెలుస్తుంది.

Advertisement

ఈ క్రమంలోనే తన తల్లిదండ్రులతోపాటు తన తమ్ముడితో కలిసి శ్రీముఖి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పసుపు రంగు దుస్తులను ధరించి నూతన గృహప్రవేశం చేసినట్టు తెలుస్తుంది.ఈ క్రమంలోనే ఈ ఫోటోలు వైరల్ కావడంతో అభిమానులు శ్రీముఖికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇక ఈమె యాంకర్ గా మాత్రమే కాకుండా వెండితెరపై పలు సినిమాలలో సందడి చేస్తున్నారు.అదేవిధంగా స్పెషల్ ఈవెంట్లలో పాల్గొంటూ శ్రీముఖి ఎంతో బిజీగా గడుపుతున్నారని చెప్పాలి.

Advertisement

తాజా వార్తలు