Minister Ponnam Prabhakar : జీహెచ్ఎంసీ సమస్యలపై ప్రత్యేక నివేదిక..: మంత్రి పొన్నం

జీహెచ్ఎంసీ అభివృద్ధిపై( GHMC Development ) కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్( Minister Ponnam Prabhakar ) అన్నారు.

తాగునీటి సమస్య లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.

జీహెచ్ఎంసీలో రెవెన్యూ పెంచుకోవడానికి ప్రత్యేక పాలసీతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు.అలాగే మూసీ అభివృద్ధికి ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు ఉంటాయని వెల్లడించారు.

అప్పులు, ఆస్తుల అంశాలపై సీఎం రేవంత్ రెడ్డికి( CM Revanth Reddy ) నివేదిక ఇస్తామని మంత్రి పొన్నం పేర్కొన్నారు.

గతంలోని బీఆర్ఎస్ ( BRS ) ప్రభుత్వం తరహాలోనే జీహెచ్ఎంసీకి నిధుల కేటాయింపు ఉంటుందని తెలిపారు.ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ సమస్యలపై ప్రత్యేక నివేదిక తయారు చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు.అదేవిధంగా డబుల్ బెడ్రూం ఇళ్లపై కూడా త్వరలోనే ప్రభుత్వం పాలసీ ప్రకటన చేస్తుందని చెప్పారు.

Advertisement

అధికారుల సమన్వయం కోసం ప్రత్యేకంగా ఓఎస్డీని నియమిస్తున్నామని తెలిపారు.

అద్భుతం చేసిన టీమిండియా.. రెండో టెస్టులో ఘనవిజయం!
Advertisement

తాజా వార్తలు