ఏపీలో త్వరలో ‘మా భవిష్యత్ నువ్వే జగన్’ కార్యక్రమం

ఏపీలో త్వరలో వైసీపీ ఆధ్వర్యంలో ‘మా భవిష్యత్ నువ్వే జగన్ ’ కార్యక్రమం జరగనుంది.

రాష్ట్రంలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి బ్రేక్ పడిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మార్చి 18వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘మా భవిష్యత్ నువ్వే జగన్ ’కార్యక్రమం నిర్వహించనున్నారు.ఇందులో భాగంగా లబ్దిదారుల ఇంటింటికి వెళ్లి ‘మా భవిష్యత్ నువ్వే జగన్ ’అంటూ గృహ సారథులు స్టిక్కర్లను అతికించనున్నారు.

ఇప్పటికే 93 శాతం గృహ సారథుల నియామక ప్రక్రియ పూర్తయింది.గత ప్రభుత్వం కన్నా.

ఈ ప్రభుత్వం అందించిన మెరుగైన పాలన, అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించనున్నారు.

Advertisement
హే ప్రభూ.. ఏంటి ఈ విడ్డురం.. బస్సు అనుకుంటే పొరపాటే సుమీ..

తాజా వార్తలు