300 రకాలకు పైగా పిండివంటలతో అల్లుడికి ఆదిత్యం..

కొత్త అల్లుడికి మొదటి పండుగ సందర్భంగా 300 రకాల పిండి వంటలతో ఆదిత్యమిచ్చి అత్తింటి వారు అదరగొట్టారు.

అనకాపల్లి హోల్సేల్ రైస్ మర్చంట్ గూండా సాయి గోపాల్ రావు కుమార్తె రిషిత( Rishita ) కు విశాఖపట్నం ఎస్ఎల్వీ జువెలరీస్ అధినేత దేవేంద్రనాథ్ గత డిసెంబర్లో వివాహం జరిగింది.

నవ దంపతులకు మొదటి పండగ సందర్భంగా అత్తింటి వారు ఆహ్వానించారు.కొత్త అల్లుడికి రాచ మర్యాదలు సహజమైనప్పటికీ.

తమ స్టైల్ లో రకరకాల పిండి వంటలు తయారు చేసి వడ్డించారు.అంతేకాకుండా తమ చేతులతో స్వయంగా అల్లుడికి తినిపిస్తూ రుచి చూపించారు.

వీటిలో రకరకాల స్వీట్లు, హాట్ లు, వివిధ రకాల రైస్ ఐటమ్, వివిధ రకాల కూరలు, పచ్చళ్ళు, టిఫిన్ ఐటమ్స్, తోపాటు పళ్ళు, డ్రై ఫ్రూట్స్, ఐస్ క్రీమ్స్ డ్రింక్స్ ఉన్నాయి, సుమారు 300 రకాలకు పైగా ఐటమ్స్ వడ్డించి రుచి చూపించి అవురా అనిపించారు.అత్తింటి వారిచ్చిన ఆదిత్యానికి అల్లుడు మురిసిపోయి పిధాయ్యాడు.

Advertisement
అవసరమా భయ్యా.. కొత్త జంట ఫస్ట్ నైట్ వీడియో అంటూ..(వీడియో)

తాజా వార్తలు