అన్ని పార్టులుగా మహేష్ జక్కన్న కాంబో మూవీ.. ఫ్యాన్స్ సంబరానికి హద్దులు ఉండవుగా!

మహేష్ రాజమౌళి( Mahesh babu, Rajamouli ) కాంబో మూవీపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొనగా ఈ సినిమాను 3 భాగాలుగా తెరకెక్కించనున్నారంటూ ఒక వార్త సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

జక్కన్న ఈ సినిమా స్క్రిప్ట్ కోసం రెండేళ్లకు పైగా సమయం కేటాయించడంతో వైరల్ అవుతున్న వార్తలు నిజమేనని చాలామంది నమ్ముతున్నారు.

ఈ వార్తలు ఫ్యాన్స్ కు సైతం ఆసక్తిని కలిగిస్తున్నాయి.మూడు పార్టులుగా ఈ సినిమా తెరకెక్కితే బాక్సాఫీస్ వద్ద సంచలన రికార్డులు క్రియేట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.

అయితే రాజమౌళి లేదా మహేష్ బాబు స్పందిస్తే మాత్రమే వైరల్ వార్తల్లో నిజానిజాలు తెలిసే ఛాన్స్ ఉంటుంది.మహేష్ బాబు పుట్టినరోజు( Mahesh Babu Birthday )కు మరో 20 రోజుల సమయం మాత్రమే ఉందనే సంగతి తెలిసిందే.

మహేష్ బాబు పుట్టినరోజున రాజమౌళి ఎలాంటి అప్ డేట్స్ ఇస్తారో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.రాజమౌళి ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెంచే విధంగా అప్ డేట్స్ ను ప్లాన్ చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.మహేష్ జక్కన్న కాంబో మూవీలో హాలీవుడ్( Hollywood )నటులు కూడా నటించే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది.

Advertisement

మహేష్ జక్కన్న కాంబో మూవీ 1000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కుతోందని తెలుస్తోంది.మహేష్ రాజమౌళి కాంబో మూవీ నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది.మహేష్ బాబు అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మహేష్ బాబు ఈ సినిమా కోసం 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్( Remuneration ) తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. మహేష్ బాబును అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు