సామాన్యులు బిగ్ బాస్ హౌస్ కు వెళ్తే అన్ని రూ.లక్షలు సంపాదించవచ్చా.. ఎలా అంటే?

బుల్లితెర రియలిటీ షో బిగ్ బాస్ షో ( Reality Show Bigg Boss Show )ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న షోలలో ఒకటని చెప్పడంలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు.

ఈ షోకు సామాన్యులు వచ్చిన ప్రతి సందర్భంలో ఈ షో రేటింగ్స్ అమాంతం పెరిగాయి.

అయితే సామాన్యులు బిగ్ బాస్ హౌస్ కు వెళ్తే ఎంత రెమ్యునరేషన్ ఇస్తారనే చర్చ జరుగుతోంది.అయితే సామాన్యులకు సైతం బిగ్ బాస్ షోకు వెళ్తే లక్షనుంచి 2 లక్షల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ దక్కనుంది.

ఈ రేంజ్ లో పారితోషికం ఆఫర్ చేస్తున్న నేపథ్యంలో చాలామంది సామాన్యులు సైతం ఈ షో విషయంలో తెగ ఆసక్తి చూపిస్తున్నారు.ఈసారి సామాన్యులలో కుమారి ఆంటీతో పాటు మరి కొందరి పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో ఏమవుతుందో చూడాల్సి ఉంది.కుమారి ఆంటీ బిగ్ బాస్( Kumari Aunty, ) హౌస్ కు వస్తే మాత్రం ఆమె కచ్చితంగా విజేతగా నిలిచే అవకాశం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో ఫ్యాన్స్ అంచనాలను మించి మెప్పించడం ఖాయమని ఈ సీజన్ మరింత స్పెషల్ కావడం పక్కా అని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. బిగ్ బాస్ షో సీజన్8 కోసం ఒకింత ఎక్కువ మొత్తం ఖర్చు చేస్తున్నారని క్రేజ్ ఉన్న సెలబ్రిటీలను ఈ షోకు ఇన్వైట్ చేస్తున్నారని సమాచారం అందుతోంది.బిగ్ బాస్ షో సీజన్8 కు కూడా నాగార్జున(Nagarjuna ) హోస్ట్ గా వ్యవహరించనున్నారు.

Advertisement

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షోలో ట్విస్టులు సైతం ఒకింత స్పెషల్ గా ఉండనున్నాయని సమాచారం అందుతోంది.స్టార్ మా ఛానల్ రేంజ్ ను బిగ్ బాస్8 మరింత పెరగడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

బిగ్ బాస్ షో కోసం బిగ్ బాస్ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు