జనసేనకు షాక్.. కైకలూరు సమన్వయకర్త రాజీనామా..!!

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేన పార్టీ( Janasena Party )కి మరో షాక్ తగిలింది.

ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త బీవీ రావు( BV Rao ) పార్టీని వీడారు.

ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) కు పంపించారు.పార్టీ అభివృద్ధి కోసం ఇన్నేళ్లుగా పని చేస్తే మిగిలిందేమీ లేదని చెప్పారు.

పొత్తులో భాగంగా కైకలూరు నియోజకవర్గ టికెట్ ను బీజేపీకి కేటాయించిన సంగతి తెలిసిందే.అయితే బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న కామినేని శ్రీనివాస్( Kamineni Srinivas ) టీడీపీ వాళ్లను మాత్రమే కలుపుకుని పోతున్నారని బీవీ రావు చెబుతున్నారు.

నియోజకవర్గంలో జనసేన ఉండకూడదని కామినేని ప్రయత్నిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తనను పిలుస్తారని చూసినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేదని మండిపడ్డారు.

Advertisement

ఈ క్రమంలోనే పార్టీని వీడినట్లు వెల్లడించారు.

యూఎస్ లో ప్రీ సేల్స్ విషయంలో దేవర అరాచకం.. ఈ రికార్డ్స్ ఎవరికీ సాధ్యం కాదంటూ?
Advertisement

తాజా వార్తలు