టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై షర్మిల ఫైర్

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు.రేవంత్ రెడ్డి అభద్రతగా ఫీల్ అవుతున్నారని తెలిపారు.

తన వలన రేవంత్ రెడ్డి ఉనికి ఎక్కడ పోతుందోనని ఆయన భయపడుతున్నారని షర్మిల పేర్కొన్నారు.తనది ఏపీ అయితే మరి సోనియాగాంధీ ఎక్కడ అని నిలదీశారు.

సోనియా గాంధీది ఇటలీ కదా అని ప్రశ్నించారు.సంస్కృతిని అర్థం చేసుకోవాలి అనుకుంటే సంస్కారం ఉండాలని చెప్పారు.

తనకు చీర, సారె పెడతారన్నారన్న ఆమె ఇక్కడ రాజకీయాలు చేయొద్దట అంటూ విమర్శించారు.ఈ తరహాలోనే సోనియాగాంధీ, రేవంత్ రెడ్డికి చీర, సారె పెడతామని తెలిపారు.

Advertisement

ఈ క్రమంలో రాజకీయాలు చేయొద్దని చెప్పే దమ్ముందా అని ప్రశ్నించారు.

60 ఏనుగుల ప్రాణాలు కాపాడిన ఏఐ.. వీడియో వైరల్..
Advertisement

తాజా వార్తలు