సమంత 'శాకుంతలం' వీఎఫ్‌ఎక్స్ అలరించేనా?

సమంత హీరోయిన్ గా గుణశేఖర్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది.

వచ్చే నెలలో విడుదల కాబోతున్న ఈ సినిమా యొక్క ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

తాజాగా ఒక పాట కూడా విడుదల అయ్యింది.పాటకు సంబంధించిన విజువల్స్ ప్రేక్షకులను ఆశ్చర్యపర్చుతున్నాయి.

సమంత అందంగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.ఇదే సమయంలో కొందరు పాటలో వాడిన వీఎఫ్‌ఎక్స్ విషయంలో విమర్శలు గుప్పిస్తున్నారు.

సోషల్‌ మీడియాలో శాకుంతలం సినిమా యొక్క ప్రచారం జోరుగా సాగుతోంది.కొందరు పాజిటివ్ గా కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం శాకుంతలం సినిమా లోని వీఎఫ్‌ఎక్స్‌ విషయంలో విమర్శలు గుప్పిస్తున్నారు.

Advertisement

ట్రైలర్‌ ను చూస్తూ ఉంటే మాత్రం గ్రాఫిక్స్ జక్కన్న సినిమాల రేంజ్ లో ఉండబోతున్నట్లుగా అనిపిస్తుంది.గుణశేఖర్ మార్క్‌ భారీ సెట్టింగ్స్ మరియు భారీ ఎత్తున వీఎఫ్‌ఎక్స్ ఈ సినిమా కు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి అంటున్నారు.

దాదాపుగా 50 నుండి 75 కోట్ల రూపాయలను శాకుంతలం సినిమా యొక్క వీఎఫ్‌ఎక్స్ వర్క్ కు ఖర్చు చేశారు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్.ఆ విషయమై ఇప్పటి వరకు ఎలాంటి అధికారికంగా క్లారిటీ రాలేదు.ఇక ఈ సినిమా తో సమంత కమ్‌ బ్యాక్ అవుతుంది అంటూ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మయో సైటిస్ వ్యాధి నుండి బయట పడ్డ తర్వాత సమంత ఈ సినిమా తో రాబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి.అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందా అనేది చూడాలి.

సమంత గుణశేఖర్ కాంబో శాకుంతలం సినిమా సరిగ్గా నెల రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమా లో పలువురు ప్రముఖ నటీ నటులు నటించడం వల్ల ఆసక్తి పెరిగింది.

జాతీయ అవార్డును పునీత్ రాజ్ కుమార్ కు అంకితం చేసిన రిషబ్ శెట్టి.. ఏం జరిగిందంటే?
వీళ్లకు వేరే సినిమాల వల్లే హిట్ సినిమాల్లో ఛాన్సెస్ వచ్చాయి..?

రుద్రమదేవి సినిమా తర్వాత గుణ శేఖర్ ఈ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.మరి ఈ సినిమా ఆయన పై ఇండస్ట్రీలో నమ్మకం పెంచుతుందా అనేది చూడాలి.

Advertisement

తాజా వార్తలు