వాళ్లని నమ్మి మోసపోయిన సాయి పల్లవి..!

ప్రేమం సినిమాతో యూత్ ఆడియెన్స్ ని అలరించిన సాయి పల్లవి తెలుగులో ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఇక్కడ ఆడియెన్స్ కి ఫేవరెట్ హీరోయిన్ అయ్యింది.

తెలుగులో వరుస సినిమాలు చేస్తూ ఇక్క సూపర్ ఫ్యాన్ క్రేజ్ ఏర్పరచుకున్న సాయి పల్లవి తను నటించిన సినిమాలతో ఫ్యాన్స్ ని అలరిస్తుంది.

ఇక సాయి పల్లవి సినిమా ఈవెంట్ అంటే చాలు ఆమెని మాట్లాడనివ్వకుండా ఫ్యాన్స్ గోల చేస్తారు.అందుకే శ్యామ్ సింగ రాయ్ ఈవెంట్ కి వచ్చిన సుకుమార్ ఆమెని పవన్ కళ్యాణ్ తో పోల్చారు.

ఇంకేముంది ఆమె క్రేజ్ చూసి విరాటపర్వం టీం ఆమెని లేడీ పవర్ స్టార్ ని చేశారు.సాయి పల్లవి పేరు ముందు లేడీ పవర్ స్టార్ అని పడటం ఆమెకి పెద్దగా ఇష్టం లేదని తెలుస్తుంది.

అదంతా విరాటపర్వం టీం సాయి పల్లవి క్రేజ్ ని వాడుకోవాలని చేసిన ప్రయత్నమే.అయితే లేడీ పవర్ స్టార్ అంటూ ఆమె నటించిన విరాటపర్వం భారీగా రిలీజైనా ఆ సినిమా ఆశించిన స్థాయి ఫలితాన్ని అందుకోలేదు.

Advertisement

ఇక ఈమధ్యనే వచ్చిన గార్గి కూడా సక్సెస్ అవలేదు.

ఈ క్రమంలో తనకు ఉన్న ఈ క్రేజ్ చూసి తను ఏ సినిమా చేసినా తన ఫ్యాన్స్ చూస్తారని నమ్మిన సాయి పల్లవి ఆడియెన్స్ చేతుల్లో మోసపోయిందని చెప్పొచ్చు.తన మీద చూపిస్తున్న అభిమానం ఆమె చేస్తున్న సినిమాల మీద కూడా మలచేందుకు ప్రయత్నాలు చేస్తుంది.కెరియర్ మొదట్లో రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేసినా ఇప్పుడు తనకంటూ గుర్తింపు తెచ్చే పాత్రలనే చేస్తుంది సాయి పల్లవి.

విరాటపర్వం, గార్గి రెండు మంచి సినిమాలే కానీ కమర్షియల్ గా క్లిక్ అవలేదు.అందుకే ఈవెంట్స్ కి వచ్చినప్పుడు సాయి పల్లవిని చూసి అరుపులు, కేకలు వేయడం కాదు ఆమె చేస్తున్న సినిమాలకు సపోర్ట్ అందించాలని ఆమె నిజమైన అభిమానులు కోరుతున్నారు.

టాలీవుడ్ స్టార్స్ కు మోక్షజ్ఞ గట్టి పోటీ ఇస్తారా.. అలా జరిగితే మోక్షజ్ఞకు తిరుగులేదంటూ?
Advertisement

తాజా వార్తలు