CM Revanth Reddy : ప్రజా ప్రభుత్వం రావడంలో ఆర్టీసీ కార్మికులది కీలక పాత్ర..: సీఎం రేవంత్

తెలంగాణలో ప్రజా ప్రభుత్వం కొలువుదీరడంలో ఆర్టీసీ కార్మికులు( RTC Employees ) కీలక పాత్ర పోషించారని సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) అన్నారు.

టీఎస్ఆర్టీసీ( TSRTC ) ఆధ్వర్యంలో నూతన బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఆర్టీసీ లాభాల్లో నడిచేందుకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని తెలిపారు.ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పారు.

కార్మిక సంఘాలతో కనీసం చర్చలు కూడా జరపలేదన్నారు.ఈ రెండు నెలల్లో ప్రభుత్వం ఆర్టీసీకి రూ.500 కోట్లు నిధులు అందించిందని తెలిపారు.ప్రతిపక్ష నేతలు అబద్ధాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు.

ఆర్టీసీకి ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

Advertisement
ముంబై: మందుబాబులను చీపుర్లతో వీర బాదుడు బాదిన మహిళలు.. ఎందుకంటే..?

తాజా వార్తలు