ఎలక్షన్ కోడ్ వలన ఆగిపోయిన రోడ్డు పనులు

యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండలంలోని సర్వేల్ గ్రామం నుండి గుడిమల్కాపురం వరకు గతంలో రోడ్డు వెంట గుంతలు ఏర్పడడంతో సరిచేస్తున్న సమయంలో ఎలక్షన్ కోడ్ అమలులో ఉండగా కొంతవరకు వేసి ఆపివేయడం జరిగింది.

కోతులాపురం వెళ్లే దారిలో చిన్నచిన్న గుంతలుగా ఉన్న వాటిని రోడ్డు మొత్తం తొవ్వడం వలన కంకర తేలి గుంతలుగా మారింది.

ఈ రోడ్డుపై చౌటుప్పల్, హైదరాబాద్ కి వెళ్లే ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు.రాత్రివేళలో రోడ్డు సరిగా లేక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, వాహనాల రద్దీ పెరుగుతున్న తరుణంలో ఎదురెదురు వాహనాలతో ఇబ్బందులకు గురి కాకుండా డబుల్ రోడ్ గా మార్చాలని కోరుతున్నారు.

తప్పిపోయిన బాలిక శ్రీజను వాడ, వాడ తిరుగుతూ తల్లిదండ్రుల వద్దకు చేర్చిన బ్లూ కోల్ట్ సిబ్బంది..

Latest Video Uploads News