అన్నమయ్య జిల్లా పీలేరు వద్ద రోడ్డుప్రమాదం

అన్నమయ్య జిల్లా పీలేరు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది.ఆగి ఉన్న లారీని తుఫాన్ వాహనం ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.మరో ఆరుగురికి తీవ్రగాయాలు అయ్యాయి.

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఆస్పత్రికి తరలించారు.అదేవిధంగా మృతులు నంద్యాల వాసులుగా గుర్తించారు.

నంద్యాల నుంచి తమిళనాడు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.అనంతరం ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
బ్రదర్‌ అనిల్‌ కుమార్‌ ‘వాక్యం’ చెప్పుకుంటూ జనాలని ‘గొర్రెల కాపరి దారి’లో నడిపించడమే మేలు?

తాజా వార్తలు