ప్రజాపాలన అని పోలీస్ రాజ్యం నడుతున్న రేవంత్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా: రేవంత్ రెడ్డి ప్రజాపాలన అని పోలీస్ రాజ్యం నడుతున్నాడని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.

రుణమాఫీ చేయాలని మా కార్యకర్తలు ధర్నాలు చేస్తుంటే బలవంతంగా అరెస్టులు చేస్తున్నారని,జర్నలిస్టుల పైన కూడా కాంగ్రెస్ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని,రేవంత్ రెడ్డి అడుగడుగునా మోసం చేస్తున్నాడని విమర్శించారు.

రైతుల రుణం తీరిస్తా అన్నోడు ఇవ్వాళ రైతులతో రణం చేస్తున్నాడని,రుణమాఫీ కాలేదని అడిగితే కేసులు పెడుతున్నాడన్నారు.ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తావా?ఎన్ని కేసులు పెట్టిన రుణమాఫీ 100 శాతం చేసేదాక పోరాటం చేస్తామన్నారు.పోలీసులు చట్టం ప్రకారం నడుచుకోవాలని,ఆరు గ్యారంటీలతో మొట్టమొదటి మోసం చేసిండని,పార్లమెంట్ ఎన్నికల ముందు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి 100% రుణమాఫీ చేస్తా అన్నాడని,కానీ,ఇవ్వాళ మాట తప్పిండన్నారు.

మాట తప్పి మోసం చేసిన రేవంత్ రెడ్డి లాంటి పాపాత్ముడిని క్షమించండని యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామికి పూజలు చేసినట్లు తెలిపారు.తెలంగాణ ప్రజల మీద కరుణ చూపమని వేడుకున్నామని,సాక్షాత్తు యాదాద్రి స్వామిపై ఒట్టేసి పచ్చి మోసం చేసిన రేవంత్ లాంటి దగుల్భాజీ వ్యక్తిని ఇప్పటివరకు చూడలేదని, మోసం చేసే నైజం రేవంత్ రెడ్డి ఉందని,అందుకే దేవుళ్లను కూడా మోసం చేసిన ఘనుడుగా మిగిలాడన్నారు.మంత్రులు ఒక మాట,సీఎం ఒక మాట మాట్లాడుతున్నారని,ఏది నిజం,ఏది అబద్ధం తేల్చాల్సిన అవసరం ఉందన్నారు.54 శాతం రుణమాఫీ కాలేదని, దీన్ని బట్టి ఎవ్వరు రాజీనామా చేయాలో చెప్పాలని ప్రశ్నించారు.రేవంత్ బయటికి వచ్చి ప్రజలకు క్షమాపణలు చెప్పాలని,దేవుళ్ళకు కూడా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ దివాళా కోరు ముఖ్యమంత్రిని దేవుడు క్షమించాలని పూజలు చేసినమని,పాలకుడే పాపం చేసిండు,పాలకుడే పాపాత్ముడు అయ్యాడన్నారు.ఇప్పటి వరకు అయిన రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలని,రైతుల పాపం రేవంత్ కి తగులుతుందన్నారు.

Advertisement

యాదాద్రి ఆలయం నుంచే మా యాత్ర మొదలుపెట్టినం,ఆయన ఒట్టు వేసిన అన్ని ఆలయాలకు వెళతామని,భండారాన్ని మొత్తం బయటపెడతామని, దేవుణ్ణి కూడా మోసం చేసిన దగుల్భాజీ రేవంత్ రెడ్డి పాలన లేకుండా గారడి చేస్తున్నారని, పైగా మళ్ళీ నన్ను రాజీనామా చేయాలని అంటుండని ధ్వజమెత్తారు.

పిడుగుపాటుకు జత ఎద్దులు మృతి
Advertisement

Latest Yadadri Bhuvanagiri News