నేను చచ్చిపోతా... నా బిడ్డలను కాపాడండి...పవన్ మాజీ భార్య సంచలన వ్యాఖ్యలు! 

ప్రస్తుతం తెలంగాణలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU) విషయం పెద్ద ఎత్తున సంచలనంగా మారింది.చాలా సున్నితమైన ఈ విషయం పై రచ్చ నడుస్తోంది.

HCU కి సంబంధించి 400 ఎకరాలలో విస్తరించి ఉన్న అడవిని(Forest), జంతువులను, అరుదైన మొక్కలను తొలగించడంపై తీవ్ర స్థాయిలో ఉద్యమం కొనసాగుతోంది.అయితే ఈ భూ వివాదంపై ఇప్పటికే యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు ఉద్యమం చేపడుతున్న సంగతి తెలిసిందే.

యూనివర్సిటీలోని ఈ 400 ఎకరాలను వదిలేయాలి అంటూ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.అయితే ఈ ఉద్యమానికి సెలబ్రిటీల మద్దతు కూడా లభిస్తుంది.

ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు విద్యార్థులకు మద్దతుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పందిస్తున్న సంగతి తెలిసిందే .ఈ క్రమంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మాజీ భార్య రేణు దేశాయ్(Renu Desai) సైతం ఈ ఉద్యమానికి మద్దతు తెలియజేశారు.ఈ క్రమంలోనే ఈమె సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రికి కొన్ని సలహాలు సూచనలు కూడా చేశారు.

Advertisement

నమస్కారం.తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) గారూ ఒక పబ్లిక్గా హృదయపూర్వక విజ్ఞప్తి.నాకు రెండు రోజుల క్రితం HCU అంశం గురించి తెలిసింది.

కొన్ని విషయాలను కూడా తాను తెలుసుకున్నానని తెలిపారు.ఒక తల్లిగా నేను మీకు చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను.

ప్రస్తుతం నా వయసు 44 సంవత్సరాలు నేను ఈరోజో రేపో చనిపోతాను కానీ నా పిల్లలతో పాటు చాలామంది పిల్లలకు భవిష్యత్తు అనేది ఉంది.వారంతా బతకాలి అంటే ఆక్సిజన్ నీళ్లు చాలా అవసరం అలాగే డెవలప్ మెంట్ కూడ అవసరం.

అయితే ఈ యూనివర్సిటీలో ఉన్న అడవిని నాశనం చేయకుండా హైదరాబాద్లో ఖాళీ ప్రదేశాలు చాలా ఉన్నాయి.ఈ అడవిని వదిలేసి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఈమె రేవంత్ రెడ్డిని కోరారు.ప్లీజ్ ఆ 400 ఎకరాలను వదిలేయండి.

Blaze: Seguridad Del Jugador Y Juego Responsable
Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...

హార్ట్ ఫుల్గా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను.మరొక్కసారి ఆలోచించండి.

Advertisement

మిగతా అధికారులకు కూడా  తాను ఇదే విషయంపై విజ్ఞప్తి చేస్తున్నానంటూ ఈమె ఒక వీడియోని షేర్ చేశారు.ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.

తాజా వార్తలు