బీజేపీలో సంస్కరణలు.. రాష్ట్రాల అధ్యక్షుల మార్పుపై ప్రకటన..!!

రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ అధిష్టానం పార్టీలో కీలక సంస్కరణలు చేసేందుకు సమాయత్తం అయింది.

ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల మార్పుపై ఇవాళ ప్రకటన చేసే అవకాశం ఉంది.

ఏపీ, తెలంగాణ, కర్ణాటక, పంజాబ్, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ తో పాటు ఒడిశా రాష్ట్రాల అధ్యక్షులను మార్చనుంది.ఈ క్రమంలో ఇప్పటికే ఏపీ చీఫ్ సోమువీర్రాజుకు ఫోన్ చేసిన జాతీయ నేత జేపీ నడ్డా పదవి నుంచి తప్పుకుని రాజీనామా చేయాల్సిందిగా సూచించారని తెలుస్తోంది.

ఆయన స్థానంలో సత్యకుమార్ లేదా మాధవ్ ను నియమించే అవకాశం ఉందనే వార్తలు జోరందుకున్నాయి.ఇటు తెలంగాణలో బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డి లేదా ఈటలకు అవకాశం ఉండొచ్చు.

అదేవిధంగా మధ్యప్రదేశ్ అధ్యక్షుడిగా నరేంద్ర సింగ్ తోమర్, పంజాబ్ అధ్యక్షుడిగా సునీల్ జాకర్, ఒడిశా అధ్యక్షుడిగా ధర్మేంద్ర ప్రధాన్, రాజస్థాన్ అధ్యక్షుడిగా గజేంద్ర సింగ్ షెకావత్ లకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని సమాచారం.

Advertisement
నెలవారీ ప్లాన్‌ ధరలను పెంచేసిన నెట్ ఫ్లిక్స్.. ఎంత పెంచిందంటే..

తాజా వార్తలు