నిన్ను చాలా మిస్ అవుతున్నా... ఎమోషనల్ పోస్ట్ చేసిన రష్మిక.. ఏమైందంటే?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ( Rashmika Mandanna ) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

ఈమె హీరోయిన్ గా వరుస సినిమాలలో నటించడమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు.

రష్మిక పుష్ప సినిమా ( Pushpa Movie ) ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.తన నటన ద్వారా భారీ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకోవడమే కాకుండా ఈమె బాలీవుడ్ సినిమా అవకాశాలను కూడా అందుకున్నారు.

ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో పాటు వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అయిన ఈమె తన సినిమా పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇక రష్మిక నటించిన పుష్ప 2 సినిమా కోసం అభిమానులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాతో పాటు బాలీవుడ్ సినిమాలు అలాగే కుబేర వంటి సినిమాలలో కూడా నటిస్తూ రష్మిక ఎంత బిజీ అయ్యారు.

ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.

Advertisement

ఇలా సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.తన వృత్తిపరమైన విషయాలు గురించి మాత్రమే కాకుండా వ్యక్తిగత విషయాలు అలాగే తన పెట్స్ ( Pets ) గురించి కూడా రష్మిక అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు.అయితే ఈమె తన పెట్ మ్యాక్సీ గురించి తరచూ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ఎన్నో విషయాలను పంచుకున్నారు అయితే తాజాగా మ్యాక్సీ చనిపోయినట్లు రష్మిక వెల్లడించారు.

ఈ విషయాన్ని తెలియజేస్తూ రెస్ట్ ఇన్ పీస్ మై గుడెస్ట్ మ్యాక్సీ.నిన్ను కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది అంటూ ఈమె ఎమోషనల్ పోస్ట్ చేశారు.ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

Advertisement

తాజా వార్తలు